నడిరోడ్డుపై 10 మందితో గుంజీలు తీయించిన పోలీసులు.. వీడియో ఇదిగో

  • యూపీలోని మొరాదాబాద్ లో ఘటన
  • నిబంధనలు ఉల్లంఘించి సిల్లీ కారణాలు చెబుతోన్న వాహనదారులు
  • గుంజీలు తీయించి వీడియో తీసిన పోలీసులు
కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని ఎంతగా చెబుతున్నా చాలా మంది అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. ఎందుకు బయటకు వచ్చారని పోలీసులు అడిగితే సిల్లీ కారణాలు చెబుతున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘిస్తోన్న వారికి పోలీసులు రోడ్లపైనే శిక్ష వేస్తున్నారు.  

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌, నవీన్‌ మండిలో నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 10 మందితో పోలీసులు, స్థానిక అధికారులు రోడ్డుపైనే గుంజీలు తీయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా తీశారు.

Police
Lockdown
Uttar Pradesh

More Telugu News